తమిళ హీరో విశాల్(Vishal) తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించారు. ఇందులో హీరో విశాల్ ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద నుండి రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు, ఆ మొత్తాన్ని లైకా సంస్థ(Lyca productions) చెల్లించినట్టుగా ఉంది. దానికి బదులుగా.. విశాల్ నిర్మించే సినిమా హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది లైకా సంస్థ. అయితే.. ఈ ఒప్పందాన్ని దాటి విశాల్ నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్ర హక్కులను లైకాకు కాకుండా వేరే సంస్థకు ఇచ్చారు. దీంతో చైన్నె హైకోర్టును ఆశ్రయించింది లైకా సంస్థ.
ALSO READ : విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? : టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం
ఈ కేసుపై పలు మార్లు చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 12న ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్ ఆస్తులను, బ్యాంక్ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు కానీ.. విశాల్ ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక సోమవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా..విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు. అందులో స్టాండర్డ్ చార్టెడ్, ఐడిబీఐ, యాక్సెస్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాల వివరాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ వివరాలు క్లియర్ గా లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.