
తమిళ, మలయాళ సినిమాల్లో మెప్పించిన మాల్వీ మల్హోత్రా.. ‘తిరగబడరసామీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. త్వరలో సినిమా రిలీజ్. ఈ సందర్భంగా మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ‘మాది హిమాచల్ ప్రదేశ్. ముంబైలో థియేటర్ ఆర్ట్స్ చేశా. టీవీ ఇండస్ట్రీ నుంచి కెరీర్ మొదలైంది.
తర్వాత హిందీ, తమిళ, మలయాళ సినిమాలు చేశా. తెలుగులో నాకిదే మొదటి సినిమా. చాలా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్. నా పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఎనర్జిటిక్గా, హైపర్ యాక్టివ్గా కనిపిస్తా. నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. అలాగే బాలకృష్ణ గారి అభిమానిలా కనిపిస్తా. ఆయనలా ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే పాత్ర నాది. ఇందులో ఎమోషన్, యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఫన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి’ అని చెప్పింది.