రాజమౌళి సినిమాలపై హీరోయిన్ మధుబాల షాకింగ్ కామెంట్స్

రాజమౌళి సినిమాలపై హీరోయిన్ మధుబాల షాకింగ్ కామెంట్స్

దర్శకుడు రాజమౌళి సినిమాలపై సీనియర్ హీరోయిన్ మధుబాల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన గుణశేఖర్ 'శాకుంతలం'లో ఈ నటి మేనక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రిజల్ట్ పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘టాలీవుడ్లో ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు భారీ హిట్టందుకున్నాయి. వాటి విజయానికి సరైన కారణాలు లేవు. అవి అంతలా సక్సెస్ ఎలా అయ్యాయో అర్థం కావడంలేదు.

అలాంటి పురాణ నేపథ్యంతోనే వచ్చిన ఈ సినిమా కోసం మా టీం ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డారు ఒక్క సీజీఐ వర్క్ కోసమే ఏడాది పనిచేశారు. అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడం బాధించింది అని మధుబాలు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు బాధించింది'అని మధుబాల ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.మణిరత్నం 'రోజా'తో ఎంట్రీ ఇచ్చిన ఈ నటి 50కి పైగా సినిమాల్లో నటించింది.