పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా

పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా

మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో ఇవాళ( సోమవారం) విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీ పోస్టుమార్టం పూర్తయ్యిందని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు వివరించారు. మరియమ్మ కుటుంబానికి రూ.15లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారు.  అంతేకాదు మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు.

దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామన్న హైకోర్టు.. నివేదిక అందిన 4వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్ పై విచారణ సెప్టెంబరు 15కి వాయిదా వేసింది.