హైదరాబాద్, వెలుగు: 2002-–03లో జరిగిన స్కాలర్షిప్ స్కామ్ కేసులో కేవీఎల్ జయసింహను హైకోర్టు దోషిగా తేల్చి.. మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే అతను జైల్లో ఉన్న కాలాన్ని శిక్షగా పరిగణించాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో గతంలో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించిన ఊరడి సంతోష్ కుమార్, కడిమి వెంకటేశ్వరరావులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. జయసింహపై ఉన్న వేర్వేరు అభియోగాలకు కోర్టు మూడేండ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది.