తిరుమలగిరిలో టెన్షన్ టెన్షన్

తిరుమలగిరిలో టెన్షన్ టెన్షన్

తిరుమలగిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జెఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఐదుగురు లబ్దిదారులు హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తమకు ఇళ్లు కేటాయించనిపక్షంలో దూకి చనిపోతామని హెచ్చరించారు. టవర్ ఎక్కిన వారిని లక్ష్మణ్, రాములమ్మ, రాజు, మహేశ్, శంకరమ్మగా గుర్తించారు. సాయిబాబా నగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్న తమకు ఇల్లు కేటాయిస్తామని ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు టవర్ దిగి వచ్చారు.