మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు జరుపుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ..మున్సిపల్ రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కొన్ని నెలలుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై వేసిన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఇవాళ(మంగళవారం) హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 128 మున్సిపాల్టీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.