టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. అజిత్ అగర్కర్ క్లారిటీ!

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. అజిత్ అగర్కర్ క్లారిటీ!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వండర్ కిడ్‌ను త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి ప్రమోట్ చేయాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, పలువురు క్రికెట్ విశ్లేషకులు బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో జరగబోయే ట్రై-సిరీస్ కోసం వైభవ్‌ను ఇప్పటికే 'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేశారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్‌కు వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

వైభవ్ కంటే జైస్వాల్ బెటర్:  
వైభవ్ సూర్యవంశీ సెలక్షన్ రేసులో ఉన్నాడా? అనే ప్రశ్నకు అజిత్ అగర్కర్ సమాధానమిస్తూ.. అతడు అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ, ప్రస్తుతానికి రేసులో యశస్వి జైస్వాల్ అతని కంటే చాలా ముందున్నాడని స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన చేశాడు, అందులో ఎలాంటి సందేహం లేదు.. కానీ మనం యశస్వి జైస్వాల్‌ను అస్సలు మర్చిపోలేం.. వైభవ్ ఎంత ఇంప్రెసివ్‌గా ఆడుతున్నాడో, అంతకంటే అద్భుతమైన ప్రదర్శనలు చేసి తనను తాను జైస్వాల్ నిరూపించుకున్నాడు.. సూర్యవంశీ ఇండియా–ఏ జట్టులో చోటు సంపాదించడం మంచి పరిణామం.. అక్కడ కూడా అతడు తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను అని అజిత్ అగర్కర్ పేర్కొన్నారు.

►ALSO READ | టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. 

తొలిసారి బరిలోకి..
గత ఏడాది (2025) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ చేదు జ్ఞాపకం తర్వాత టీమిండియా ఆడబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగం కానప్పటికీ.. రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనల సన్నాహకాల దృష్ట్యా టీమిండియాకు ఇది చాలా కీలకం.

హెడ్ టు హెడ్ రికార్డులు: 
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ జరిగింది. 2018లో బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 262 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.