నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రంలోని ఆరో నెంబర్ రూంలో నాలుగు బాక్సులు సీల్ లేకుండా ఉన్నాయని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ అభ్యర్థి జయసారథి రెడ్డికి చెందిన ఏజంట్లు ఈ విషయంపై ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు ఏజంట్లను బయటకు పంపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఏజంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.