
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హైదరాబాద్ కు పౌర ముఖ్యమంత్రిగా ఎం.కె.వెల్లోడిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండేవి.
- 1952, ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య 95.
- 1952 ఎన్నికల్లో పీజెంట్స్ వర్కర్స్ పార్టీ 10 సీట్లను గెలుచుకున్నది.
- ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది.
- బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోం మంత్రిగా బిందు దిగంబరరావు బాధ్యతలు స్వీకరించారు.
- 1952లో హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా కాశీనాథరావు వైద్య, పంపనగౌడ సక్రిప్ప పనిచేశారు.
- బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా కాలంలో ప్రజలు ముఖ్యంగా యువకులు తీవ్ర అసహనానికి గురికావడం వల్ల గైర్ ముల్కీ ఉద్యమం వచ్చింది.
- ముఖ్యంగా గైర్ ముల్కీ ఉద్యమం తీవ్రంగా వరంగల్ జిల్లాలో వచ్చింది.
- గైర్ ముల్కీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడాన్ని ఖండిస్తూ వరంగల్ జిల్లాలోని విద్యార్థులు బంద్ కు 1952, జులై 26న పిలుపు ఇచ్చింది.
- 1952, జులై 28న వరంగల్ లోని విద్యార్థులతో ఏర్పడిన యాక్షన్ కమిటీకి కన్వీనర్గా బుచ్చయ్య బాధ్యతలు చేపట్టారు.
- 1952, ఆగస్టు 6న బుచ్చయ్య, విద్యార్థులు కలిసి బూర్గుల రామకృష్ణారావుకు గైర్ ముల్కీలపై తీర్మానాన్ని అందించారు.
- గైర్ ముల్కీలపై సబ్కమిటీ వేశామనే సమాచారాన్ని యాక్షన్ కమిటీకి అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ గోవిందరావు దేశ్పాండే
- తెలియజేశారు.
- సిటీ కాలేజ్ సంఘటనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ శివకుమార్ లాల్ సభలు, సమావేశాలను నిషేధించాడు. ఇందుకు సెక్షన్ 22, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం విధించారు.
- 1952, సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరపడానికి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ వేశారు.
- 1952లో హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పత్రావ్ పల్నితేకార్.
- జి.రామాచారి స్థానికులనే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని హితరక్షణి సభలో పేర్కొన్నాడు.
- ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండు చేసిన ముఖ్య నాయకులు సురవరం ప్రతాపరెడ్డి, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి.
- సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోల్కొండ కవుల సంచికలో 350 మంది తెలంగాణ కవుల వివరాలు వెలువరించారు.
- తెలంగాణకు సాహిత్యపరంగా ప్రత్యేకమైన ఉనికి ఉన్నదని సురవరం ప్రతాపరెడ్డి చెప్పారు.
- 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కె.వి.రంగారెడ్డి డిమాండు చేశారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భావనను ముందుగా డిమాండు చేసిన వ్యక్తి కె.వి.రంగారెడ్డి కావున ఆయన్ని తెలంగాణ పితామహుడిగా పేర్కొంటారు.
- విశాలాంధ్ర ఏర్పడితే తమకు అన్యాయం జరుగుతుందని మర్రి చెన్నారెడ్డి పేర్కొన్నారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలని తీర్మానాన్ని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
- ఆంధ్రలో తెలంగాణ విలీనమైతే నిర్లక్ష్యానికి గురయ్యేవి నందికొండ, పోచంపాడు ప్రాజెక్టులు.
- బూర్గుల రామకృష్ణారావు మొదట్లో తెలంగాణవాదిగా ఉండి తర్వాత విశాలాంధ్రవాదిగా మారడానికి సామాజికవర్గాల పోరు, పదవీ కాంక్ష కారణం.
- ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించడానికి కర్నూల్ లో ఏబీసీడీ అనే గుడారాలను నిర్మించారు.
- ఏబీసీడీ అనే గుడారాలను వేసిన నగరానికి డేరానగర్ అనే పేరు పెట్టారు.
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి గవర్నర్ చందూలాల్ త్రివేది.
- నిజాం రాజరిక ఫ్యూడలిజం వల్ల తెలంగాణ ప్రజలు ఇంగ్లీష్ భాషలో, విద్యలో వెనుకబడ్డారు.