Competative Exams: తెలంగాణలో గైర్ ముల్కీ ఉద్యమం

Competative Exams:  తెలంగాణలో గైర్ ముల్కీ ఉద్యమం

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హైదరాబాద్​ కు పౌర ముఖ్యమంత్రిగా ఎం.కె.వెల్లోడిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 

  • 1952లో హైదరాబాద్​ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండేవి. 
  • 1952, ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య 95.
  • 1952 ఎన్నికల్లో పీజెంట్స్ వర్కర్స్ పార్టీ 10 సీట్లను గెలుచుకున్నది.
  • ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది.
  • బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోం మంత్రిగా బిందు దిగంబరరావు బాధ్యతలు స్వీకరించారు.
  • 1952లో హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్​గా, డిప్యూటీ స్పీకర్​గా కాశీనాథరావు వైద్య, పంపనగౌడ సక్రిప్ప పనిచేశారు. 
  • బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా కాలంలో ప్రజలు ముఖ్యంగా యువకులు తీవ్ర అసహనానికి గురికావడం వల్ల గైర్ ముల్కీ ఉద్యమం వచ్చింది. 
  • ముఖ్యంగా గైర్ ముల్కీ ఉద్యమం తీవ్రంగా వరంగల్ జిల్లాలో వచ్చింది. 
  • గైర్ ముల్కీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడాన్ని ఖండిస్తూ వరంగల్ జిల్లాలోని విద్యార్థులు బంద్ కు 1952, జులై 26న పిలుపు ఇచ్చింది. 
  • 1952, జులై 28న వరంగల్ లోని విద్యార్థులతో ఏర్పడిన యాక్షన్ కమిటీకి కన్వీనర్​గా బుచ్చయ్య బాధ్యతలు చేపట్టారు. 
  • 1952, ఆగస్టు 6న బుచ్చయ్య, విద్యార్థులు కలిసి బూర్గుల రామకృష్ణారావుకు గైర్ ముల్కీలపై తీర్మానాన్ని అందించారు. 
  • గైర్ ముల్కీలపై సబ్​కమిటీ వేశామనే సమాచారాన్ని యాక్షన్ కమిటీకి అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ గోవిందరావు దేశ్​పాండే 
  • తెలియజేశారు. 
  • సిటీ కాలేజ్ సంఘటనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ శివకుమార్ లాల్ సభలు, సమావేశాలను నిషేధించాడు. ఇందుకు సెక్షన్ 22, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం విధించారు. 
  • 1952, సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరపడానికి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ వేశారు. 
  • 1952లో హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పత్రావ్ పల్నితేకార్.
  • జి.రామాచారి స్థానికులనే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని హితరక్షణి సభలో పేర్కొన్నాడు. 
  • ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండు చేసిన ముఖ్య నాయకులు సురవరం ప్రతాపరెడ్డి, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. 
  • సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోల్కొండ కవుల సంచికలో 350 మంది తెలంగాణ కవుల వివరాలు వెలువరించారు. 
  • తెలంగాణకు సాహిత్యపరంగా ప్రత్యేకమైన ఉనికి ఉన్నదని సురవరం ప్రతాపరెడ్డి చెప్పారు. 
  • 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కె.వి.రంగారెడ్డి డిమాండు చేశారు.
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భావనను ముందుగా డిమాండు చేసిన వ్యక్తి కె.వి.రంగారెడ్డి కావున ఆయన్ని తెలంగాణ పితామహుడిగా పేర్కొంటారు. 
  • విశాలాంధ్ర ఏర్పడితే తమకు అన్యాయం జరుగుతుందని మర్రి చెన్నారెడ్డి పేర్కొన్నారు. 
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలని తీర్మానాన్ని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 
  • ఆంధ్రలో తెలంగాణ విలీనమైతే నిర్లక్ష్యానికి గురయ్యేవి  నందికొండ, పోచంపాడు ప్రాజెక్టులు. 
  • బూర్గుల రామకృష్ణారావు మొదట్లో తెలంగాణవాదిగా ఉండి తర్వాత విశాలాంధ్రవాదిగా మారడానికి సామాజికవర్గాల పోరు, పదవీ కాంక్ష కారణం. 
  • ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించడానికి కర్నూల్ లో ఏబీసీడీ అనే గుడారాలను నిర్మించారు. 
  • ఏబీసీడీ అనే గుడారాలను వేసిన నగరానికి డేరానగర్ అనే పేరు పెట్టారు. 
  • ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి గవర్నర్ చందూలాల్ త్రివేది. 
  • నిజాం రాజరిక ఫ్యూడలిజం వల్ల తెలంగాణ ప్రజలు ఇంగ్లీష్​ భాషలో,  విద్యలో వెనుకబడ్డారు.