- పనిచేసే కంపెనీని, కస్టమర్లను మోసం చేస్తున్న కొరియర్ బాయ్స్
- కరీంనగర్ జిల్లాలో నలుగురు యువకుల అరెస్టు
- రూ.9 లక్షల వస్తువులు స్వాధీనం
సైదాపూర్, వెలుగు: ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్చేసిన వస్తువులను కొట్టేసి వాటి ప్లేసులో రాళ్లు, పెంకులు, బండలను డెలివరీ చేస్తున్న కొరియర్బాయ్స్నలుగురిని కరీంనగర్జిల్లా సైదాపూర్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కల్యాణ్, అనగోని వికాస్, కనుకుంట్ల అనిల్, తూటి వినయ్ హుజూరాబాద్ టౌన్లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ(ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్డెలివరీ చేసే కంపెనీ)లో 3 నెలలుగా కొరియర్బాయ్స్గా పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీళ్లు డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్స్కొట్టేయాలని ప్లాన్చేశారు. అందుకు యూట్యూబ్లో వీడియోలు చూసి ప్యాకింగ్ఎలా ఓపెన్చేయాలి, తర్వాత తిరిగి ఎలా ప్యాక్చేయాలో నేర్చుకున్నారు. ప్లాన్ప్రకారం వీళ్లు డెలివరీకి వెళ్లే రూట్లోని బంధువులు, స్నేహితులతో విలువైన వస్తువులు ఆర్డర్ చేయించేవారు. వాటిని హుజూరాబాద్ ఫ్లిప్ కార్ట్ హబ్లో కలెక్ట్ చేసుకుని సైదాపూర్ వెళ్లేవారు. తెలిసిన వారి పేరుతో వచ్చిన ఆర్డర్లను క్యాన్సిల్ చేయించి వచ్చిన వస్తువులను కొట్టేసి బండరాళ్లు పెట్టి తిరిగి కంపెనీకి రిటర్న్ చేసేవారు. బయటి వాళ్లవి అయితే కస్టమర్లు ఫోన్లిఫ్ట్ చేయడం లేదని చెబుతూ విలువైన ప్రొడక్ట్స్కొట్టేసి తర్వాత వాటి ప్లేసులో రాళ్లు, పెంకులు పెట్టి డెలివరీ చేసేవారు. కొట్టేసిన వాటిని బయట అమ్ముకుని కొన్నిరోజులుగా జాల్సాలు చేస్తున్నారు.
ఒకే ఏరియాలో లక్షల్లో మాయం
ఒకే ఏరియాలో లక్షల విలువైన వస్తువులు మాయం అవ్వడంతో ఫ్లిప్కార్ట్ హుజురాబాద్ హబ్ టీం లీడర్ ముప్పు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో నలుగురు యువకులు అడ్డంగా దొరికారు. వారి నుంచి 8 ల్యాప్ టాప్స్, 4 కెమెరాలు, 5 వాచీలు, 5 మొబైల్ ఫోన్స్, 4 ఎయిర్ పాడ్స్, వైర్లెస్ చార్జర్, సోనీ మ్యూజిక్ సిస్టం, 3 జతలు నైక్ షూ, రోడ్స్టర్ జాకెట్, ఆపిల్ పెన్సిల్ ఇలా రూ.9 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.