- మొదటి విడతలో ఇప్పటికే రావిర్యాల-ఆమన్గల్పనులు షురూ
- రెండో విడత బుద్వేల్-రోస్గి వరకు..
- వీటితోపాటు మరో 14 గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదన
హైదరాబాద్సిటీ, వెలుగు: సమగ్ర మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రోడ్లను విస్తరించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ ను కలుపుతూ16 ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇందులో రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకు 41.50 కి.మీ రోడ్డు పనులను 4,621 కోట్లతో ప్రారంభించారు. తాజాగా, మరో గ్రీన్ఫీల్డ్ రోడ్ ను బుద్వేల్ నుంచి కోస్గి వరకు 81 కి.మీ. రోడ్డు నిర్మించాలని ప్రపోజల్స్రెడీ చేశారు. దీని కోసం ఆయా మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రెండు రోడ్లతో పాటు మరో 14 గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు.
తెలంగాణ రైజింగ్లో భాగంగా..
తెలంగాణ రైజింగ్–2047 లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రతిపాదిత ఫ్యూచర్సిటీ అభివృద్ధితో పాటు ట్రిపుల్ఆర్వరకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వినోద కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
ఈ రోడ్లన్నీ 300 ఫీట్లతో నిర్మించనున్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లు నిర్మించాలంటే పెద్దయెత్తున భూ సేకరణ అవసరం అవుతుంది. అందుకే, హైదరాబాద్గ్రోత్కారిడార్ లిమిటెడ్(హెచ్ జీసీఎల్) అధికారులు రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ట్రిపుల్ఆర్ను కలుపుతూ ఓఆర్ఆర్ఎగ్జిట్పాయింట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు.
ఓఆర్ఆర్కు 22 ఎగ్జిట్ పాయింట్లున్నాయి. ఇందులో 16 పాయింట్ల నుంచి రోడ్లు వేస్తారు. మొదటగా ఓఆర్ఆర్13 నంబర్ఎగ్జిట్ పాయింట్ రావిర్యాల నుంచి ఆమన్గల్వరకూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఫ్యూచర్సిటీ మీదుగా కొంగర కుర్ధు నుంచి కొంగర కలాన్, అక్కడి నుంచి మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమన్గల్ మీదుగా ఆకు తోటపల్లి వరకూ ట్రిపుల్ఆర్ను కలుపుతూ రోడ్డు వేయనున్నారు.
బుద్వేల్ -కోస్గి మరో గ్రీన్ఫీల్డ్..
గ్రీన్ఫీల్డ్రోడ్ల నిర్మాణానికి అవసరమైన వందల ఎకరాల భూములను సేకరించడం పెద్ద టాస్కే అని, దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు హెచ్జీసీఎల్అధికారి ఒకరు తెలిపారు. తాజాగా రెండో గ్రీన్ఫీల్డ్రోడ్డును 81 కి.మీ. మేర నిర్మించనున్నారు. మొదట కొత్వాల్గూడ నుంచి పరిగి వరకూ 55 కి.మీ. మేరకు ఈ రోడ్డును వేయాలని అనుకున్నా..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతో కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇప్పటికే ఆయా మార్గాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు సేకరించడం ఈజీ అని, కానీ, పట్టా భూములు సేకరించడం కష్టమైన విషయమని, భూములను కలిగి ఉన్న వారిని ఒప్పించి సేకరించవలసి ఉంటుందంటున్నారు. ట్రిపుల్ఆర్పూర్తయ్యే నాటికి మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్, తోటపల్లి వరకూ రోడ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంతా ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్మధ్యనే ఉండే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను విస్తరించడాలని అధికారులు ప్లాన్లు రూపొందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అన్ని వైపులా ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్వరకూ రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయనున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం, 2047 నాటికి 3.5లక్షల ఇండ్లను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. బుద్వేల్ – కోస్గి మధ్య నిర్మించే గ్రీన్ఫీల్డ్ రోడ్ కు సంబంధించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. పారిశ్రామిక కేంద్రాలకు, లాజిస్టిక్ హబ్లు నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్ఫీల్డ్ మీదుగా రాకపోకలు సాగించడం తేలికవుతుందని కూడా భావిస్తున్నారు.
