- రన్నరప్గా నిలిచిన నిజామాబాద్
- ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి గర్ల్స్సాఫ్ట్బాల్(అండర్19) పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్లో మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లా జట్ల మధ్య పోటీ జరిగింది. మహబూబ్నగర్ జట్టు 3-2 స్కోర్తో విజేతగా నిలిచింది. వరంగల్, ఆదిలాబాద్జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పోటీల విజేతలకు మంచిర్యాల ఒలింపిక్అసోసియేషన్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్రెడ్డి, డీఐఈవో అంజయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు బహుమతులు అందజేశారు.
అనంతరం ఆయా క్రీడా సంఘాల బాధ్యులను సన్మానించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో కూడిన రాష్ట్ర జట్టు జనవరిలో నాగ్పూర్లో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటుందని ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్(అండర్17) సెక్రటరీ యాకుబ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్సారా తస్లీమా, పెద్దన్న, పీఈటీలు పాల్గొన్నారు.
