హైదరాబాద్​​.. కోకాపేటలో ప్లాట్ల వేలం

హైదరాబాద్​​.. కోకాపేటలో ప్లాట్ల వేలం
  • హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ
  • వచ్చే నెల 3న ఆన్​లైన్ వేలం

హైదరాబాద్, వెలుగు : కోకాపేట నియో పొలిస్ ఫేజ్ 2లో ఏడు ప్లాట్లలో 45.33 ఎకరాలను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్  విడుదల చేసింది. ఎకరాకు కనీస ధరను రూ.35 కోట్లుగా ఖరారు చేశారు. ప్లాట్ల వేలం ద్వారా రూ.2 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు, రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు, ఈ నెల 31 వరకు డిపాజిట్  అమౌంట్ కట్టేందుకు వచ్చే నెల 1 వరకు గడువు విధించింది. ఒక్కో ప్లాట్ కు  ఈఎండీ డిపాజిట్ రూ.5 కోట్లుగా నిర్ణయించారు. 

వచ్చే నెల 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. 2021 లో ఇక్కడ హెచ్ఎండీఏ ప్లాట్లను వేలం వేయగా కనిష్టంగా ఎకరా రూ.31 కోట్లు, అత్యధికంగా రూ.60 కోట్లు పలికింది. ఈసారి కూడా ఎకరా రూ.50 కోట్లకుపైనే పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.