అవెన్యూ, గ్రీనరీ ప్లాంటేషన్ కు ఆర్డర్లు
డిఫరెంట్ ట్రీస్,ఫాస్ట్ గ్రోత్తో ఇంట్రెస్ట్
6 జిల్లాల నుంచి రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ డెవలప్మెంట్లో కీ రోల్ పోషిస్తున్న హెచ్ఎండీఏ గ్రీనరీ జిల్లా కేంద్రాలనూ అట్రాక్ట్ చేస్తోంది. ఓఆర్ఆర్, యాదాద్రి హైవే వెంట గ్రీనరీతోపాటు శివారు జంక్షన్లలోనూ ల్యాండ్ స్కేప్లు డెవలప్చేస్తోంది. 7 జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ గ్రీనరీ, అర్బన్ పార్కులు, అవెన్యూ ప్లాంటేషన్, మియావాకి తరహా ఫారెస్ట్ పెంపకానికి కృషి చేస్తోంది. 32 నర్సరీల ద్వారా ప్రస్తుతం 3.5కోట్ల మొక్కలు పెంచుతోంది. తక్కువ ఎత్తులో ఉండడం, స్థానిక నర్సరీల్లో పెంచే మొక్కల కంటే వేగంగాపెరుగుతుండడం వల్ల హెచ్ఎండీఏ మొక్కలు జిల్లాలను ఆకర్షిస్తున్నాయి.
15లక్షల మొక్కలకు ఆర్డర్లు
మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో హెచ్ఎండీఏ మొక్కలతో రోడ్లకు రెండువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. తాజాగా డిఫరెంట్ మొక్కలు కావాలని కోరగా, 2.3లక్షల డెకరేటివ్ ప్లాంట్స్అందించనుంది. వాటిల్లో బోగన్ విల్లా, బాంబే బార్డర్, రావి, చింత, ఎర్ర చందమామతోపాటు పండ్ల జాతి మొక్కలున్నాయి. సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల అధికారులూ మొక్కల కోసం హెచ్ఎండీఏను ఆశ్రయించారు. ఇప్పటివరకు 15లక్షల మొక్కలు కావాలని ఆర్డర్లు వచ్చినట్లు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఉన్నతాధికారి తెలిపారు. హరితహారంలో భాగంగా గతేడాది నుంచి కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ఫ్రీగా పంచుతోంది. మొక్కలను సంరక్షించకపోతే చర్యలు ఉంటాయనే కండీషన్తో ప్రైవేటు సంస్థలకూ పంపిణీ చేస్తోంది.