బండ్లగూడ, పోచారంలో ఖాళీగా 2200 ఫ్లాట్లు

బండ్లగూడ, పోచారంలో ఖాళీగా 2200 ఫ్లాట్లు
  • గతంలో అప్లై చేసి ఫ్లాట్ రానోళ్లకు హెచ్ఎండీఏ మరో చాన్స్

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో అమ్ముడుపోగా మిగిలిన రాజీవ్ స్వగృహ అపా ర్ట్​మెంట్ల కొనుగోలుకు హెచ్ఎండీఏ మరో చా న్స్​ ఇచ్చింది. గతంలో అప్లై చేసి లాటరీలో ఫ్లాట్ రానోళ్లకు మాత్రమేనని వెల్లడించింది. 26 కల్లా టోకెన్ అమౌంట్ కట్టాలని సూచించింది. 2 ప్రాంతాల్లో త్రిబుల్ డీలక్స్, త్రిబుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు మొత్తం 2,200 ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

హెచ్ఎండీఏ కమిషనర్ పేరుతో 3బీహెచ్​కే కు రూ.3లక్షలు, డబుల్ కు రూ.2 లక్ష లు, సింగిల్ బెడ్ రూమ్ కు రూ.1 లక్ష డీడీ తీసి హిమాయత్ నగర్ లోని రాజీవ్ స్వగృహ ఎండీ కార్యాలయంలో ఇవ్వాలని పేర్కొంది. లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని, లాటరీలో ఫ్లాట్ రాకపోతే టోకెన్ అమౌంట్ తిరిగి ఇస్తామని చెప్పింది. వివరాలు www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in లో చూడాలంది. బండ్లగూడ ఫ్లాట్లకు వీరయ్య (7993455776) , పోచారం ఫ్లాట్లకు సంతోశ్​ రెడ్డి (7993455791)ని సంప్రదించాలని, ఫిర్యాదులు ఉంటే  swagruha.customercare@gmail.com కి మెయిల్ చేయాలని తెలిపింది.