
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇండియా వచ్చారు. భారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం జస్టిన్ ముంబై చేరుకున్నారు. గురువారం ఆయన ముంబై చేరుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు జరిగే సంగీత్ కోసం జస్టిన్ ని ఇండియా రప్పించారని టాక్.
శుక్రవారం జరిగే ఈవెంట్ లో జస్టిన్ తన పాటలతో ఆహుతులను ఆకట్టుకోనున్నాడు. జూన్ 12న జరుగునో ఈ పెళ్ళికోసం రేపటి నుండే ఈవెంట్స్ మొదలుకానున్నాయి. ఈ ఈవెంట్స్ లో అడెల్, లానా డెల్ రే, డ్రేక్ వంటి స్టార్స్ సింగర్స్ సైతం పాటలు పడనున్నారు. ఇక ఈ ఈవెంట్ కోసం జస్టిన్ బీబర్ కి దాదాపు రూ.100 కోట్లు ఇస్తున్నారని సమాచారం. కేవలం ఒక సింగర్ కోసం రూ.100 కోట్లు ఆఫర్ చేశారని టాక్. ఇక మొత్తం పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేస్తన్నారని అంచనా.
నిజానికి.. అనంత్ అంబానీ పెళ్లికి ఐదు నెలల ముందు నుంచే హంగామా మొదలైంది. మార్చిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరే రేంజులో చేశారు. ఆ ఈవెంట్ కోసం కూడా వేలాది కోట్లు ఖర్చు చేశారు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. గుజరాతీ సాంప్రదాయాల్లో ఒకటైన మామేరు సంప్రదాయ ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగనుంది.