డిసెంబర్ 25న ‘ఈషా’ విడుదల: క్లైమాక్స్ స్టన్నింగ్ అంటున్న మేకర్స్.

డిసెంబర్ 25న ‘ఈషా’ విడుదల: క్లైమాక్స్ స్టన్నింగ్ అంటున్న మేకర్స్.

ఇటీవల లిటిల్‌‌‌‌హార్ట్స్‌‌‌‌, రాజు వెడ్స్‌‌‌‌ రాంబాయి లాంటి చిత్రాలను విడుదల చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఇప్పుడు ‘ఈషా’ పేరుతో  ఓ  హారర్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  త్రిగుణ్, అఖిల్ రాజ్,  హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌‌‌‌లో శ్రీనివాస్ మన్నె  తెరకెక్కించిన ఈ చిత్రాన్ని   కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.

  ఈనెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న  బన్నీ వాస్, వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్స్‌‌‌‌లో ఓ డిఫరెంట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.  మొదటి పది నిమిషాల్లోనే  మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో  అందరికీ అర్థమవుతుంది. ఈ సిని మా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం.  

తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. క్లైమాక్స్‌‌‌‌లో వచ్చే సీన్స్ స్టన్నింగ్‌‌‌‌గా ఉంటాయి. చివరి 20 నిమిషాలు హారర్‌‌‌‌ సినిమాలా అనిపించదు. ఓ మంచి విషయాన్ని చెప్పారని ఫీల్ అవుతారు.  మన లైఫ్‌‌‌‌లో కూడా ఇలా జరిగిందా అనే ఫీల్‌‌‌‌ కలుగుతుంది. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్‌‌‌‌ చేయదు.  ఇప్పుడు మేము వెళుతున్న జర్నీ  చాలా బాగుంది.  ఫస్ట్‌‌‌‌కాపీ చూసిన తరువాత మా జడ్జిమెంట్‌‌‌‌ బాగుంటుంది. మాదొక కొత్త ట్రెండ్‌‌‌‌.  ఫిల్మ్‌‌‌‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.