పామా యిల్ సాగుతో రైతులకు అధిక లాభాలు : సెరికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి

పామా యిల్ సాగుతో రైతులకు అధిక లాభాలు : సెరికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి

మరికల్/ నారాయణపేట, వెలుగు : పామాయిల్ సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని హార్టికల్చర్​, సెరికల్చర్​ రాష్ట్ర డైరెక్టర్​ డాక్టర్​పొన్నుస్వామి తెలిపారు. గురువారం మండలంలోని జిన్నారం, తీలేరు, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్, మామిడి, కూరగాయల తోటలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 10 శాతం విస్తీర్ణంలోనే సాగు జరుగుతోందన్నారు. ఇక్కడి నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలమని, రైతులు ధైర్యంగా సాగు చేపట్టవచ్చని సూచించారు. అనంతరం ప్రధాన మంత్రి ధన్​ ధాన్య యోజన (పీఎండీడీకేవై) స్కీమ్​పై  నారాయణపేట కలెక్టరేట్​లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి సమీక్షించారు. స్కీమ్​ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.