- హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను కోరిన సూపరింటెండెంట్ రాజారావు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ను సందర్శించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు కోరారు. బుధవారం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిసిన రాజారావు ఆయనకు బొకే ఇచ్చి విషెస్ తెలిపారు. గాంధీ హాస్పిటల్ను సందర్శించాలని మంత్రిని ఆహ్వానించారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సైతం మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విషెస్ తెలిపారు.