ప్రగతినగర్ లో బాలుడి మృతి .. ఘటనలో ఇద్దరిపై కేసు

 ప్రగతినగర్ లో బాలుడి మృతి .. ఘటనలో ఇద్దరిపై కేసు

జీడిమెట్ల, వెలుగు: ప్రగతినగర్ ఎన్​ఆర్ఐ కాలనీలో ఆడుకుంటూ నాలాలో పడి చనిపోయిన బాలుడి ఘటనలో ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు​ మండలం మిడ్తనపల్లికు చెందిన సంతోష్​రెడ్డి, దివ్య శ్యామల దంపతులు ప్రగతినగర్​లోని స్పాటైల్​ గార్డినియా అపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. వీరి కుమారుడు మిథున్​రెడ్డి(4) మంగళవారం  ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చాడు.

ప్రమాదవశాత్తు మూత తీసి ఉన్న నాలాలో బాలుడు పడి కొట్టుకుపోయాడు. బాచుపల్లి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి గజ ఈతగాళ్లతో సమీపంలోని చెరువులో గాలింపు చేపట్టారు.  సుమారు 6 గంటల తర్వాత చెరువులో బాలుడి మృతదేహం దొరికింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అపార్ట్​మెంట్​అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు వాచ్​మన్ ​భరత్​ నాలా మూతను తొలగించినట్లు సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో ఇద్దరిపై 304 ఏ  సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు.