జీడిమెట్ల, వెలుగు: ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఆడుకుంటూ నాలాలో పడి చనిపోయిన బాలుడి ఘటనలో ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం మిడ్తనపల్లికు చెందిన సంతోష్రెడ్డి, దివ్య శ్యామల దంపతులు ప్రగతినగర్లోని స్పాటైల్ గార్డినియా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరి కుమారుడు మిథున్రెడ్డి(4) మంగళవారం ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చాడు.
ప్రమాదవశాత్తు మూత తీసి ఉన్న నాలాలో బాలుడు పడి కొట్టుకుపోయాడు. బాచుపల్లి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి గజ ఈతగాళ్లతో సమీపంలోని చెరువులో గాలింపు చేపట్టారు. సుమారు 6 గంటల తర్వాత చెరువులో బాలుడి మృతదేహం దొరికింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అపార్ట్మెంట్అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు వాచ్మన్ భరత్ నాలా మూతను తొలగించినట్లు సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో ఇద్దరిపై 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.