హైదరాబాద్​లో ఇండ్ల అమ్మకాల జోరు

హైదరాబాద్​లో ఇండ్ల అమ్మకాల జోరు

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్ క్వార్టర్‌‌లో అత్యధికంగా ఇండ్లు అమ్ముడైన టాప్–2 సిటీల్లో హైదరాబాద్​చోటు దక్కించుకుంది. మొదటిస్థానంలో అహ్మదాబాద్ నిలిచింది. కొత్త ప్రాపర్టీల సగటు విలువలు ఈ కాలంలో 7శాతం వరకు పెరిగాయి. ఇన్‌‌‌‌పుట్ ఖర్చులు పెరగడం, భౌగోళిక, రాజకీయ సమస్యలు, ఆర్​బీఐ రేట్ల పెంపు వంటి వాటి వల్ల ఇండ్ల ధరలు పెరిగాయి. హైదరాబాద్, అహ్మదాబాద్​తోపాటు మిగతా ఆరు నగరాల్లోనూ ఇండ్ల అమ్మకాలు బాగున్నాయని ప్రాప్​టైగర్ డాట్​కామ్​రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం..2022 ఏప్రిల్-జూన్ మధ్య అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌‌కతా, ముంబై, ఢిల్లీ, పుణేలలో అమ్మకాలు పెరిగాయి. ఆర్​బీఐ రెపో రేటును పెంచినప్పటికీ హోమ్​లోన్ల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఎనిమిది సిటీల్లో 2022 క్యూ1లో 70,620 యూనిట్లు అమ్మగా, క్యూ2లో 74,330 యూనిట్లు అమ్ముడయ్యాయి. సీక్వెన్షియల్ గా అహ్మదాబాద్‌‌లో 30శాతం, హైదరాబాద్‌‌లో 21శాతం అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్​లో ఈ ఏడాది క్యూ2లో 7,910 యూనిట్లు,  క్యూ1లో 6,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్​లో అమ్మకాలు 5,550 యూనిట్ల నుంచి 7,240 యూనిట్లకు పెరిగాయి.