ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ.4.35 కోట్ల ట్యాక్స్

ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ.4.35 కోట్ల ట్యాక్స్

దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మించిన ఇంటికి రూ. 4.35 కోట్ల ట్యాక్స్ విధించారు మున్సిపల్ అధికారులు.  ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఆనంద్ భవన్‌కు పెద్ద మొత్తంలో ఇంటి పన్ను వచ్చింది. నాన్ రెసిడెన్షియల్ కేటగిరి కింద టాక్స్ నోటీసులు ఇచ్చినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. 2013 నుంచి ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఇంత మొత్తంలో విధించాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇందిరా గాంధీ ఆనంద్ భవన్ లో జన్మించారు. ఈ ఇంటిని జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. చాలా రోజులుగా దీనిపై విధించిన ట్యాక్స్ కట్టకపోవడంతో ఆస్తి చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ..చివరకు నోటీసు ఇచ్చామన్నారు ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.

ఆనంద్ భవన్ కు నోటీసులు జారీ చేయడంపై …స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్‌ కోసం నిర్వహిస్తున్న ఆనంద్ భవన్‌పై  ఎలాంటి పన్ను వేయరాదని మాజీ మేయర్ చౌదరి జితేంద్రనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనికి అన్ని రకాల పన్ను మినహాయింపులు ఉంటాయని గుర్తు చేశారు.