గుజరాత్లోని ఓ స్కూల్లో పిచ్చి ప్రశ్న
ఎంక్వైరీకి ఆదేశించిన విద్యాశాఖ అధికారులు
అహ్మదాబాద్: మహాత్మా గాంధీ ఎట్ల సూసైడ్ చేసుకున్నరు? అరే.. ఇదేం ప్రశ్న అనుకుంటున్నరా? గుజరాత్లోని గాంధీనగర్లో ఓ స్కూల్లో ఇట్లనే అడిగారు మరి. దెబ్బకు గుజరాత్ విద్యా శాఖ అధికారులంతా షాక్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ అనే సంస్థ కింద గాంధీనగర్లో స్కూళ్లు నడుస్తున్నాయి. 9వ తరగతి స్టూడెంట్లకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్నిర్వహించారు. అందులో ‘గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?’ అని గుజరాతీలో ఓ ప్రశ్న ఇచ్చారు. అంతేకాదు.. 12వ తరగతి స్టూడెంట్లకు మరో పిచ్చి ప్రశ్న ఇచ్చారు. ‘మీ ఏరియాలో మద్యం అమ్మకాలు పెరగడం, దొంగసారా అమ్మే వారి ఆగడాలు ఎక్కువ కావడంపై జిల్లా పోలీస్ చీఫ్కు ఫిర్యాదు చేస్తూ లెటర్రాయండి’ అని అడిగారు.
అసలు మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్లో ఇలాంటి ప్రశ్న అడగడమేంటనిఅధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలు అభ్యంతరకరమని, విచారణకు ఆదేశించామని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని గాంధీనగర్ విద్యా శాఖ అధికారి భరత్ వధేర్ చెప్పారు. క్వశ్చన్పేపర్లను స్కూల్ మేనేజ్మెంట్ రూపొందించిందని, వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సంస్థ ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందుతుండటం మరో విడ్డూరం.