బీజేపీ సర్కార్ ఎకానమీపై దాడి చేసింది: రాహుల్ గాంధీ

బీజేపీ సర్కార్ ఎకానమీపై దాడి చేసింది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శానాస్త్రాలు సంధించారు. మోడీ సర్కార్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పతనమైందనే విషయాన్ని కొన్ని సిరీస్‌ వీడియోల రూపంలో రాహుల్ ప్రస్తావించారు. దీనికి సంబంధించి సోమవారం ఉదయం 10 గంటలకు తన సోషల్ మీడియా చానెల్స్‌లో వీడియోను పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై దాడి చేసింది. నేను మీకు మూడు ఉదాహరణలు ఇస్తా.. పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, లాక్‌డౌన్‌’ అని వీడియో ప్రోమోలో రాహుల్ చెప్పారు.