
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ రేట్లు, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా (ఈ నెల16న) , యూఎస్ ఫెడ్ మీటింగ్ (ఈ నెల 18న) వంటి అంశాలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్ను నిర్ణయించనున్నాయి. టారిఫ్ న్యూస్ కూడా మార్కెట్పై ప్రభావం చూపుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. జియోపొలిటికల్ టెన్షన్ల కారణంగా కిందటి వారం మార్కెట్లో వోలటాలిటీ కనిపించింది.
బెంచ్మార్క్ ఇండెక్స్లు శుక్రవారం అర శాతానికి పైగా పడ్డాయి. అంతకు ముందు సెషన్లో కూడా ఒక శాతం నష్టపోయాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో బ్రెంట్ క్రూడాయిల్ రేటు ఒక్కసారిగా 9 శాతం పెరిగింది. మార్కెట్ పడడానికి ఇది కూడా ఒక కారణం. “ఇజ్రాయెల్, -ఇరాన్ గొడవలతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బ తీయొచ్చు. యూఎస్ ఫెడ్ రేట్ నిర్ణయం బుధవారం వెలువడనుంది.
జపాన్, యూకే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ వారం తమ పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నాయి”అని ఆల్మండ్జ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఎనలిస్ట్ కేతన్ వికం పేర్కొన్నారు. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, “హై వాల్యూయేషన్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది. యూఎస్ ఫెడ్ మీటింగ్పై అందరి దృష్టి ఉంది” అని అన్నారు.