తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. జూన్ 25న ఆదివారం కావడంతో సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్లో నిలుచున్నారు భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టోకెన్ దర్శనానికి ,నడకదారి దివ్యదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
ఒక్కరోజే 83, 889 మంది దర్శించుకున్నరు
జూన్ 24న స్వామివారిని 83, 889 భక్తులు దర్శించుకున్నారు. 40, 495 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కోట్ల స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.10 వచ్చింది.