తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. జూన్ 25న ఆదివారం కావడంతో  సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్లో నిలుచున్నారు భక్తులు.  సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టోకెన్ దర్శనానికి ,నడకదారి దివ్యదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

ఒక్కరోజే 83, 889 మంది దర్శించుకున్నరు

జూన్ 24న స్వామివారిని 83, 889 భక్తులు దర్శించుకున్నారు. 40, 495 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కోట్ల స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.10 వచ్చింది.