యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ఒకే రోజు రూ.45.68 లక్షల ఆదాయం

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ఒకే రోజు రూ.45.68 లక్షల ఆదాయం
  •     ధర్మదర్శనానికి మూడు ,  స్పెషల్ దర్శనానికి గంట  
  •     రూ.45.68 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వరుసగా రెండు రోజులు హాలీడేస్ రావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో..కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం సందడిగా మారాయి. 

ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, సత్యనారాయణస్వామి వ్రతాలు, సువర్ణపుష్పార్చన పూజల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.45,68,806 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.19,11,620, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6 లక్షలు, వీఐపీ దర్శన టికెట్లతో రూ.7,89,300 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.3,34,200, ప్రధాన బుకింగ్​తో రూ.1.59 లక్షలు, యాదరుషి నిలయం ద్వారా రూ.2,40,630, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.1,03,980 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.