యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు భక్తులు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రతేక దర్శనానికి 2 గంటలు టైం పడుతోంది. స్వామివారి నిజాభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొమురవెల్లిలో ఆలయానికి పోటెత్తిన భక్తులు

సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. మహామండపంలో కల్యాణం, ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాగణంలో గంగరేణి చెట్టు దగ్గర పట్నాలు వేసి, మట్టి పాత్రలలో బోనం సమర్పించారు. స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో తరివస్తున్నారు భక్తులు.