
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడగా.. పలువురు మృతి చెందినట్లు సమాచారం.
సోమవారం (జూన్ 30) ఉదయం కంపెనీ రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది.పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎడిరిపడ్డారని చెబుతున్నారు. పరిశ్రమలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. మంటల్లో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.
కార్మికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ధృవ ఆసుపత్రికి తరలించారు. పది మందికిపైగా కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.