ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం 

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం 

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో 10 ఫైరింజన్లను రంగంలోకి దింపారు. 

ప్లాస్టిక్ ఫ్యాక్టరీ నడుస్తున్న భవనంలో చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గుర్ని కాపాడారు. చిక్కుకున్న వారికి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. భవనంలో పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నట్లు తెలియడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.