రాజమండ్రి రైల్వే బ్రిడ్జి ఎక్కి పారుతున్న వరద (వీడియో)

రాజమండ్రి రైల్వే బ్రిడ్జి ఎక్కి పారుతున్న వరద (వీడియో)

ఇంత భారీ వరద 37 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

రాజమండ్రి: భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూప దాల్చింది. కనివినీ ఎరుగని రీతిలో భార వరద పోటెత్తుతోంది. రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్వే బ్రిడ్జి ఎక్కి పారుతోంది. ఎంత వరద వచ్చినా రైల్వే బ్రిడ్జి ఎక్కి పారడం అనేది జరగదు. అయితే ఇప్పుడు రైల్వే ట్రాక్ పై ఎక్కి పారుతోంది. గోదావరికి ఇంత భారీ వరద రావడం 37 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడేనని స్థానికులు చెబుతున్నారు. కుండపోత వానలకు తోడు.. గోదావరి కూడా పొంగుతుండడంతో అధికారులు నదితీర ప్రాంతాల వారిని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సిందిగా హెచ్చరికలు చేస్తున్నారు.