
జీడిమెట్ల, వెలుగు: అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో కొండ చిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గురువారం నిజాంపేట పరిధి ప్రగతినగర్లోని సాయి ఎలైట్ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొండ చిలువను పట్టుకున్నారు. దాన్ని బౌరంపేట స్నేక్ పార్కు నిర్వాహకులకు అప్పగించారు. ఇటీవల కురిసిన వానలకు వరదలో కొండ చిలువ కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.