టీకా కోసం తిప్పలు.. కిలోమీటర్ల మేర జనం క్యూ

టీకా కోసం తిప్పలు.. కిలోమీటర్ల మేర జనం క్యూ

నిజామాబాద్ జిల్లా నవీపేటలో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పబ్లిక్. వ్యాక్సిన్ సెంటర్ ముందు కిలోమీటర్ల వరకు ప్రజలు బారులు తీరారు. ఉదయమే 7 వందల మందికి పైగా పబ్లిక్ వచ్చారు. ఐతే 500 మందికి టీకా ఇచ్చేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి టీకా ఇవ్వరని...  టీకా తీసుకోని వాళ్లకు  రేషన్ ఇవ్వరనే  ప్రచారంతో పబ్లిక్ పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది. టీకా కోసం భారీగా జనం రావడంతో తోపులాట జరిగింది. ఇద్దరే మహిళా కానిస్టేబుళ్లు ఉండటంతో కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది.