
భద్రాచలం శ్రీసీతారామచం ద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఇవాళ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూకబ్జాదారులు ఈవో రమాదేవి పై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆలయ భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణ దారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా వాటిని నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది.
►ALSO READ | తెలంగాణ వాటా యూరియాను సకాలంలో పంపండి: నడ్డాకు CM రేవంత్ రిక్వెస్ట్