హైదరాబాద్లో రేపు (జులై 09) బ్యాంకులు బంద్..?

హైదరాబాద్లో రేపు (జులై 09) బ్యాంకులు బంద్..?

సమ్మెకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది

బషీర్​బాగ్, వెలుగు: జులై 9న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో రెండు తెలుగు రాష్ట్రాల  నుంచి బ్యాంకులు, ఇన్సూరెన్స్​రంగాలకు చెందిన దాదాపు లక్ష మంది పాల్గొననున్నట్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జాయింట్  ఫోరం ఆఫ్ ఫైనాన్సియల్ సెక్టార్ యూనియన్స్(జెఎఫ్ఎఫ్ ఎస్​యూ) ప్రకటించింది. 

హైదరాబాద్ కోఠిలో బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సంస్థల ఉద్యోగులు, అధికారుల యూనియన్లతో జెఎఫ్​ఎఫ్​ఎస్​యూ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం నేత బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ..  బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. 

ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమద్ ఖాన్, ఫణికుమార్, రవీంద్రనాథ్, సతీశ్​తదితరులు పాల్గొన్నారు.