- బీఆర్ఎస్ ప్రకటించిన లిస్టులో ఒక్క ముదిరాజ్ లేడు
- పట్టించుకోకపోతే కామారెడ్డిలో కేసీఆర్పై నామినేషన్లు వేస్తం
కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: తమను విస్మరించే ఏ పార్టీనైనా వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని ముదిరాజ్ కులస్తులు హెచ్చరించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘ధర్మ యుద్ధం’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్నుంచి మొదలైన ర్యాలీ కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్, సిరిసిల్ల, జేపీఎన్, సుభాష్నగర్రోడ్ల మీదుగా సాగింది. దారిలో అంబేద్కర్, జ్యోతిబాఫూలే విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్కిష్టయ్య విగ్రహానికి నివాళి అర్పించారు. కొద్ది సేపు నిజాంసాగర్చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్కు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు.
ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన 115 మందిలో ఒక్క ముదిరాజ్ కూడా లేరని మండిపడ్డారు. కనీసం నామినేటెడ్ పోస్టులు, జడ్పీ చైర్మన్ పదవులు ఇవ్వడం లేదన్నారు. బీసీ–డిలో ఉన్న తమను బీసీ–ఎలోకి మార్చాలని, ముదిరాజ్కార్పొరేషన్ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. భూమి లేనిపేదలకు 3 ఎకరాలు, మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలు తమపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్స్పందించి తమ సమస్యలు పరిష్కరించకుంటే కామారెడ్డిలో ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, గజ్వేల్నియోజకవర్గాలతో పాటు చాలాచోట్ల అత్యధిక ఓట్లు ముదిరాజులవేనని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ నిజ్జన రమేశ్, అబ్రబోయిన స్వామి, సూర్యప్రసాద్, చింతల నీలకంఠం, భూపాల్విజయానంద్, పిల్లి మల్లేశ్, కాకర్ల శేఖర్, శంకర్, కుడుముల సత్యం, బైండ్ల పోచయ్య, రాజ్దాస్, తూర్పు రాజు పాల్గొన్నారు.