శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట.. 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట.. 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్న క్రమంలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ క్రమంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఏర్పాట్ల‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌మీక్షలో పాల్గొన్నారు దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.

ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సీఎం  చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామ‌న్యుల‌కే పెద్ద‌పీఠ వేస్తున్న‌ట్లు తెలిపారు మంత్రి ఆనం.

ALSO READ : నేను ఉన్నప్పుడే నెంబర్ 1..

స‌మావేశంలోని ముఖ్యాంశాలు: 

  • ప‌దిరోజుల్లో 182 గంట‌ల ద‌ర్శ‌న స‌మ‌యంలో 164 గంట‌లు అంటే దాదాపు 90శాతం సామాన్యుల‌కే కేటాయింపు.
  • ప‌ది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు అత్యంత వైభ‌వంగా ఏర్పాట్లు.
  • తొలి మూడు రోజుల ద‌ర్వ‌నాల‌కు 27 రాష్ట్రాల నుండి 23.64 ల‌క్ష‌ల మంది ఈ-డిప్ కు న‌మోదు
  • 1.89 ల‌క్ష‌ల మంది సామాన్య భ‌క్తుల‌కు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.
  • భ‌క్తులు ఏరోజు, ఏ స‌మ‌యానికి ద‌ర్శ‌నానికి రావాలో స‌మాచారం అంద‌జేత‌.
  • టోకెన్ లేని భ‌క్తులు జ‌న‌వ‌రి 2 నుండి 8వ తేది వ‌ర‌కు స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలకు అవ‌కాశం.
  • స్వామివారి ద‌ర్శ‌నాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు విరివివిగా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, త‌దిత‌ర స‌దుపాయాలు.
  • ఏఐ టెక్నాల‌జీతో క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, భ‌క్తుల సంఖ్య‌, వేచి ఉండే స‌మ‌యాన్ని అంచ‌నా వేస్తూ క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌.
  • పోలీసులు, టీటీడీ విజిలెన్స్ స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు.
  • అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని సంయ‌మ‌నంతో స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి.
  • భ‌క్తుల‌కు పూర్తిస్థాయిలో సంతృప్తి క‌లిగేలా నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లు అందించాల‌ని సిబ్బందికి సూచ‌న‌. 

ఈ స‌మావేశంలో టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, దేవాదాయ‌శాఖ సెక్ర‌ట‌రీ శ్రీ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్‌, ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడు, సీవీఎస్వో శ్రీ ముర‌ళీ కృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.