స్కాలర్‎షిప్ పేరుతో భారీ స్కాం.. రూ. కోటికి పైగా వసూల్

స్కాలర్‎షిప్ పేరుతో భారీ స్కాం.. రూ. కోటికి పైగా వసూల్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‎లో భారీ మోసం వెలుగుచూసింది. స్కాలర్‎షిప్ పేరుతో విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేసి.. ఉడాయించారు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో విద్యార్థులకు స్కాలర్‎షిప్‎లు ఇస్తామంటూ నిర్వాహకులు అప్లికేషన్ల ద్వారా విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్నారు. సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుంచి 4 వేల రూపాయల చొప్పున.. అందరి నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వసూల్ చేశారు. స్కాలర్‌షిప్‎లు ఏమయ్యాయంటూ విద్యార్థుల పేరెంట్స్ నిలదీయడంతో నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్‎లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేసి.. 1500 అప్లికేషన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.