నాంపల్లి ఎగ్జిబిషన్ ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

నాంపల్లి ఎగ్జిబిషన్ ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

నాంపల్లి ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు అధిక సంఖ్యలో హైదరాబాద్ నగర వాసులు వస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు రద్దీ పెరుగింది. ప్రతి రోజూ వేలాదిగా సిటీజనం వస్తున్నారు. దీంతో నిర్వాహకులు, పోలీసులు... సందర్శకుల రద్దీని కంట్రోల్ చేయలేక పోతున్నారు.  

రద్దీ కారణంగా నాంపల్లి మెట్రో స్టేషన్ నుండి గాంధీ భవన్ వెళ్లే రూట్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. పార్కింగ్ పాయింట్స్ లో వాహనాలు నిండిపోవడంతో పార్కింగ్ కు స్థలం లేక రోడ్డు పక్కనే వాహనదారులు.. వెహికిల్స్ ను పార్క్ చేస్తున్నారు. దీంతో తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురవుతున్నారు.

బీజేపీ పార్టీ ఆఫీస్ వైపు దిగిన వారికి.. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ రాంప్ పై నుంచి రోడ్ క్రాస్ చేయాలని జనాలకు పోలీసులు సూచిస్తున్నారు. సెలవులు కావడంతో గతం కంటే ఎక్కువగా మంది వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారిలో ఎక్కువ మంది  సొంత వాహనాల్లో వస్తుండడంతో..  గాంధీ భవన్ మెట్రో టు నాంపల్లి మెట్రో స్టేషన్ రూట్ వాహనాలతో నిండిపోయింది. ఈ క్రమంలో  భారీగా ట్రాఫిక్ అవుతుంది.