భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా వాహనాదారులు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా  ఎక్సైజ్ ట్యాక్స్ ను  భారీగా తగ్గించింది కేంద్రం. లీటర్ పెట్రోల్ పై రూ.5 తగ్గించగా..లీటర్ డీజిల్ పై 10 రూపాయలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గిన ఎక్సైజ్ సుంకం రేపటి (గురువారం) నుంచి అమల్లోకి రానున్నాయి. కొంత కాలంగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడిన వాహనదారులు ... తాజాగా కేంద్రం తగ్గించిన ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.