మనుషుల అక్రమ రవాణా: ముఠా అరెస్ట్

మనుషుల అక్రమ రవాణా: ముఠా అరెస్ట్

మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాను సైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17మంది ముఠా సభ్యులను పట్టుకోగా.. వారినుండి 200 నకిలీ పాస్ పోర్టులు, వీసాలను స్వాధీనం చేసుకున్నారు. సైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మనుషులను అక్రమ రవాణా చేస్తున్న 71మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని చెప్పారు.  వీరిపై 14కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరో21మంది పరారీలో ఉన్నారని అన్నారు. మనుషులను అక్రమ రవాణా చేయడానికి ముంబైలోని ఓ రిజిస్టర్ ఏజెంట్ తో సదరు ముఠాకు లింకులున్నాయని తెలిపారు.