
బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవిలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన వేటగాళ్లు పులుల ట్రాకింగ్సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లి దొరికిపోయారు. జైపూర్ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి అటవీ రేంజ్పరిధిలో ఇటీవల పులి సంచరిస్తుండగా ట్రాకింగ్ చేసేందుకు అటవీ సిబ్బంది గత మార్చిలో 4 సీసీ కెమెరాలను అమర్చారు. అదే నెలలో కెమెరాలు చోరీ అయ్యాయి. కాగా అటవీ అధికారులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
బొమ్మెన గ్రామానికి చెందిన వేటగాళ్లు కోల తిరుపతి, మానేపల్లి సమ్మయ్య , భట్టు కిష్టయ్య, మడె భీమయ్య వన్యప్రాణులను వేటాడుతుంటారు. నలుగురిని అరెస్ట్ చేసి శుక్రవారం విచారించారు. అదే నెలలో రాత్రి అటవీలో నలుగురూ జంతువులను వేటాడేందుకు వెళ్లారు. పులి ట్రాకింగ్ కెమెరాల ప్లాష్ లైట్ కు చిక్కారు. దీంతో భయపడి అటవీ అధికారులకు దొరికిపోతామనే భయంతో ట్రాప్ కెమెరాలను తీసుకెళ్లి కోల తిరుపతి ఇంట్లో దాచి ఉంచారు. ఆ తర్వాత మైలారం అడవుల్లోనూ మరోసారి వేటకు వెళ్లగా అక్కడ కూడా సీసీ కెమెరాల ప్లాష్కు చిక్కడంతో వాటిని ధ్వంసం చేసినట్టు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బ్యాటరీ లైట్, నాలుగు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ శ్యాంపటేల్
ఉన్నారు.