మతాన్ని కించపరచడం మా ఉద్దేశం కాదు : ఖర్గే

మతాన్ని కించపరచడం మా ఉద్దేశం కాదు : ఖర్గే

న్యూఢిల్లీ: మతాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్య క్రమం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు. ఈ ప్రోగ్రామ్ బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్​ల పొలిటికల్ ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మతాలను, గురువులను అవమానించడం మా ఉద్దేశం కాదు.  యువతకు ఉద్యోగాలు కల్పించడాని కి ప్రధాన మంత్రి ఏమి చేస్తున్నారు? పేదల కోసం ఏమి చేస్తున్నారు?  అని నిలదీయటమే మా ఉద్దేశం. దేవుడి మీద నమ్మకం, భక్తి ఉన్నవాళ్లు గుడికి ఎప్పుడైనా వెళ్తారు. రామ మందిరానికి సంబంధించిన అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. అందుకే వేడుకలకు వెళ్లడం లేదు. దీనికి కూడా కాంగ్రెస్‌‌‌‌పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నది’  ఖర్గే చెప్పారు.