భార్య విడిచి వెళ్లిందని.. తల్లి సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

భార్య విడిచి వెళ్లిందని.. తల్లి సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

కట్టుకున్న భార్య తనను విడిచి వెళ్లిందనే మనస్థాపంతో తల్లిసమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు  ఓ భర్త. అన్నంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్యకు ముందు  సెల్ఫీ వీడియో తీశాడు.  ఈ  ఘటన  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోరం జరిగింది.  కొండన్న గూడ గ్రామానికి చెందిన రాజు అతని భార్య శ్వేత  మూడేళ్లుగా  షాద్ నగర్ లో ఉంటున్నారు.   గూడ్స్ వెహికల్ డ్రైవర్ గా పని చేస్తున్న రాజు భార్య  మూడు రోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన  రాజు.. తన భార్య  ఇక రాదనే మనస్థాపంతో  అన్నంలో పురుగుల మందు కలుపుకుని తన పొలంలోని  తల్లి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే  సమయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు.

తనకు తన భార్య అంటే చాలా ఇష్టమని తన తల్లి కన్నా తానే ఎక్కువ అంటూ వీడియోలో చెప్పాడు రాజు. తనంటే ఇష్టం లేదని..తన మీద నమ్మకం లేదనే  తన భార్య ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఎక్కడ ఉన్న బాగుండాలని  కోరాడు. తాను చనిపోయాక తన భార్య శ్వేతపై ఎలాంటి కేసు పెట్టొద్దంటూ పోలీసులను కోరాడు.  తనకు పిల్లలు ఉన్నారని  జాగ్రత్తగా చూసుకోవాలని వేడుకున్నాడు రాజు.