తనకు బిజినెస్ క్లాస్ టికెట్... భార్యా పిల్లలకు ఎకానమి క్లాస్ టికెట్లు..

తనకు బిజినెస్ క్లాస్ టికెట్...  భార్యా పిల్లలకు ఎకానమి క్లాస్ టికెట్లు..

సినిమాలకు వెళ్లినా.. షికార్లకు వెళ్లినా.. ప్రయాణం చేస్తున్నా... భార్య..భర్త పక్కనే కూర్చోవాలని.., పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుంటారు.  ఒకరి భావాలను మరొకరు పంచుకోవాలనుకుంటారు.  ఇంట్లో ఎలా ఉన్నా..ప్రయాణాల సమయంలో మాత్రం అందరూ ఒక్కచోట చేరి..ముచ్చట్లు ఆడాలని భావిస్తారు. అయితే కొంతమంది భర్తలు మాత్రం  శాడిజంతో తాను ఒకచోట కూర్చొని..భార్యాపిల్లలను మరోచోట కూర్చోబెడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఓ విమానంలో జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయింది. 

 ఓ కుటుంబం విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ వ్యక్తి బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకొని.. తన భార్యా పిల్లలకు మాత్రం  ఎకానమీ టికెట్ తీసుకున్నాడు. అయితే దీనికి తీవ్రంగా హర్ట్ అయిన భార్య..తన భర్తతో ప్రయాణించేటప్పుడు ఆయన పక్కన కూర్చోవాలనుకోవడం స్వార్ధమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ పోస్ట్ పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. చాలా మంది భర్తను మందలించి "స్వార్థపరుడు" అని కామెంట్ చేశారు.  మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

తన భర్త ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం చేస్తూ.. తాను.. పిల్లలను ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేసిన ఈ ఘటన చర్చకు దారితీసింది. ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఎథిక్స్ కాలమ్‌లో ఆ మహిళ తనకు ఎదురైన కష్టాలను వెల్లడించింది.  ఆమె తన భర్తతో కూర్చోవాలనుకోవటంలో తప్పేముందని అడిగింది.  తన  భర్త ప్రయాణం చేయడమంటే ఇష్టపడతాడు. ఎప్పుడూ  ఫస్ట్ క్లాస్ లోనే ప్రయాణం చేస్తాడు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు తమను  ఎకానమీ క్లాస్ టికెట్లు తీసుకుంటాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల రాత్రిపూట పారిస్‌కు వెళ్లే విమానంలో కూడా ఇలా చేసాడని ఆ మహిళ తెలిపింది.  తల్లిదండ్రులు  పక్కన లేకుండా పిల్లలు  ప్రయాణించడం తనకు ఇష్టం లేదని అతను చెప్పాడని ఆమె పేర్కొంది. ఏది ఏమైనా అతను అలా చేయడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.