భార్యను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నభర్త

భార్యను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నభర్త

భార్యని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త . ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పలపల్లి గ్రామంలో జరిగింది. చిప్పలపల్లిలో  కాసోజీ జంగయ్య (50),కాసోజీ కృష్ణవేణి(47) దంపతులకు నలుగురు కూతుళ్లు. వారిలో ముగ్గురు కూతుళ్లకు వివాహం  అయ్యింది. చిన్న కూతురు ప్రస్తుతం డిగ్రీ చదువుకుంటుంది. ఆదివారం బంధువుల గ్రామంలో జాతరకు వెళ్ళగా రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు జంగయ్య. పొద్దున ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సంఘటన స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.