
హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ లీడర్లు మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. మంత్రిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేశారు.
మంత్రిని కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సొల్లు బాబు, మాల మహానాడు నాయకుడు పాక సతీశ్, కాంగ్రెస్ లీడర్లు సారంగపాణి, కరీంనగర్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ బండి మల్లేశం, సదానందం, రిటైర్డ్ పీడీ సొల్లు సారయ్య పాల్గొన్నారు.