- బల్దియా కాంట్రాక్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి
ఖైరతాబాద్, వెలుగు: గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, కొత్త సర్కార్ అయినా బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కోరింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో అసోసియేషన్అధ్యక్షుడు ఎ.రామకృష్ణరెడ్డి, జనరల్సెక్రటరీ ఎం.సురేందర్సింగ్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు రూ. 1,200 కోట్లు బిల్లులు రావాలన్నారు.
మరో వెయ్యి కోట్ల పనులు ప్రాసెస్లో ఉన్నాయని, కాంట్రాక్ట్ పనులపై ఆధారపడి 2.50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. అప్పులు చేసి నిర్వహించిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోగా ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. బల్దియాలో కాంట్రాక్ట్పనులు నిర్వహించేవారు మొత్తం 3,500 మంది ఉన్నారని, తామంతా చిన్న కాంట్రాక్టర్లమన్నారు. ఈ సమావేశంలో ట్రెజరర్ మహ్మద్ నిజాముద్దీన్, ఆరిఫ్ అహ్మద్,మధుసూదన్, వసంత్కుమార్,రామచంద్రరెడ్డి,చంద్రశేఖరరెడ్డి, ప్రసాద్నాయక్, సైదులు పాల్గొన్నారు.