
- డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే జైలుకే..
- వీడియోలు చూసినా చర్యలు తప్పవ్
- ఎక్స్లో సిటీ సీపీ సజ్జనార్ వార్నింగ్
హైదరాబాద్ సిటీ , వెలుగు: నగరంలో చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్ఫోన్స్పెట్టుకుని పాటలు వినడం, కాల్స్మాట్లాడడం చేస్తున్నారని, వీడియోలు కూడా చూస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. సిటీలో ఆటోలు, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు డ్రైవింగ్చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్ఫోన్స్పెట్టుకుని నిమిషాల తరబడి మాట్లాడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.
మన మెదడు మల్టీ టాస్కింగ్ ( ఒకేసారి రెండు పనులు చేయడం) చేస్తున్నప్పుడు తికమక పడి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇయర్ ఫోన్స్ డ్రైవర్ దృష్టిని మరల్చి, ప్రమాదాలను పెంచుతాయన్నారు. డ్రైవర్లు రూల్స్ పాటించకపోతే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యలుంటే నేరుగా తనకు మెజేస్ చేయాలని సీపీ సజ్జనార్ సిటీ ప్రజలకు తెలిపారు. తన ట్విట్టర్ ఐడీ x.com/SajjanarVCకు డైరెక్ట్గా టెక్స్ట్ చేయాలని సూచించారు.